Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్‌ డోర్‌ గేమ్స్‌ ఆడించడం తప్పనిసరి.

New Update
Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Heart Attack in Teen Age : గుండెపోటు(Heart Attack) తో మరణించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇంతకు ముందు గుండెపోటు, గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వచ్చేవి. అయితే ఇటీవల మారుతున్న జీవనశైలి(Life Style), తప్పుడు ఆహార, మద్యపాన అలవాట్ల వల్ల చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు గత కొద్దిరోజులుగా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలలో గుండెపోటుకు కారణాలు:

కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటాయి. వారి గుండెల్లో రంధ్రాలు(Holes In The Heart) ఉంటున్నాయి. ఇవి పిల్లల గుండె కవాటాలు, నాళాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే తమ బిడ్డకు తీవ్రమైన అనారోగ్యం ఉందని తల్లిదండ్రులకు మాత్రం తెలియడం లేదు. పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. అలాగే ఈ రోజుల్లో పిల్లలు బయట అంటే మైదానంలో ఆడటం తక్కువ. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇది వారిలో బీపీని పెంచుతుంది, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

పిల్లల్లో గుండెపోటు లక్షణాలు:

పెదవుల దగ్గర నీలం రంగు మచ్చలు, శ్వాస సమస్యలు, నడిచేటప్పుడు శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, ఛాతీ నొప్పి(Chest Pain) వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏం చేయాలి..?

పిల్లలకు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉంటే సకాలంలో వైద్యుడిని సంప్రదించండి. పుట్టిన బిడ్డకు అన్ని గుండె పరీక్షలు చేయండి. పిల్లలను జంక్ ఫుడ్ తిననివ్వకండి. బయట లేదా మైదానంలో ఆడుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment