Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి!

ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు మందగిస్తుంది.

New Update
Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి!

Protein: బాడీ ఫిట్ నెస్, మెరుగైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ దక్కుతుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలోనూ ప్రోటీన్‌ పాత్ర కీలకం. అనేక శాఖాహార, మొక్కల ఆధారిత ఫుడ్‌లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే మీరు కండరాల నొప్పి, బలహీనత వంటి సమస్యలకు గురవుతారు.

ఎంత ప్రోటీన్‌ కావాలి?

  • ప్రోటీన్ లోపం ఎక్కువ కాలం కొనసాగితే మంచిది కాదు. దీనివల్ల మీరు కొన్ని తీవ్రమైన వ్యాధులకు కూడా గురవుతారు. రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ పెద్దలకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, 75 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు, శరీర నిర్మాణం మారడం ప్రారంభిస్తుంది. ఇది మెరుగుపడకపోతే కాలేయ వ్యాధి, బోన్‌ సమస్యలను పెంచుతుంది. కండరాలు, ఎముకలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి మాత్రమే కాదు, శరీర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు అభివృద్ధిని కూడా మందగించేలా చేస్తుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్‌ క్వాన్‌టిటి ఉండేలా చూసుకోండి.

అనేక రోగాలు రావొచ్చు:

  • ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. మహిళలపై ఒక అధ్యయనం జరిపారు సైంటిస్టులు. తొమ్మిది వారాల పాటు తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అనుసరించడం వారి రోగనిరోధక ప్రతిస్పందనను గణనీయంగా తగ్గించిందని చూపించింది. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కాలేయ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. చికిత్స చేయకపోతే సిరోసిస్ లాంటి సమస్యలు రావొచ్చు. అంతేకాదు కాలేయం ఫెయిల్‌ కూడా అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది?..ఆరోగ్యానికి మంచిదేనా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు