Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి

కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.

New Update
Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి

Anshuman Gaikwad: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ నిన్న రాత్రి మరణించారు. గత కొంత కాలంగా ఆయన బ్లడ్ కాన్సర్‌‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్ళు. గైక్వాడ్‌ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. కెరీర్ మొత్తంలో 2254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. దీంతో పాటూ ఆయన టీమ్‌ఇండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా పనిచేశారు. తరువాత కూడా ఆయనను కోచ్‌గా కొనసాగించారు. అన్షుమన్‌ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 1990ల్లో జాతీయ టీమ్‌ సెలెక్టర్‌గా, ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు.

టీమ్ ఇండియాకు ఇన్ని సేవలు చేసిన అన్షుమన్ గైక్వాడ్ చాలా రోజులుగా ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నారు. తనకు వచ్చిన క్యాన్సర్ ట్రీట్ మెంట్‌కు కూడా అతని దగ్గర డబ్బులు లేవు. ఈయన ఆరోగ్యం గురించి, ఆర్థిక పిస్థితుల గురించి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐకు విజ్ఞప్తి కూడా చేశారు. దీనికి స్పందించిన బీసీసీఐ వెంటనే ఆర్థిక సహాయం కూడా చేయడానికి ముందుకు వచ్చిందికూడా. అయితే ఇంతలోనే ఆయన కన్నుమూశారు. అన్షుమన్ మృతికి ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు. క్రికెట్‌కు గైక్వాడ్‌ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

Also Read:Kerala: వయనాడ్‌లో మృత్యుఘోష.. 254కు చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్‌ అనే పేరు తెరపైకి వచ్చింది.

New Update
Kasireddy Rajasekhar Reddy

Kasireddy Rajasekhar Reddy

 AP Liquor scam : వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయనను సోమవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్‌ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శంషాబాద్‌ నుంచి రాత్రి 11.10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. 

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
 
కాగా రాజ్‌ కెసిరెడ్డి.. సిట్‌ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ, ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది. మరోవైపు రాజ్‌ కెసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవటంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్‌ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులిచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవటం సాధ్యం కాదని గుర్తించిన రాజ్‌ కెసిరెడ్డి.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు.  కానీ ఈ లోపు సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఎవరీ బల్లం సుధీర్‌ ?

కాగా కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.  నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్‌తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్‌వర్క్‌తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్​ఎదుట ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర్‌ అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తుంది. ఇంతకు సుధీర్ ఎవరు అనే కోణంలో అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి, సుధీర్​ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్​ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్​దే కీలకపాత్ర​అని అంటున్నారు. సుధీర్‌ అరెస్ట్‌ అయితే మరిన్ని సంచలనలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

 

Advertisment
Advertisment
Advertisment