National: ప్రైవేట్ మెంబర్ ఉచిత ఇంటర్నెట్ బిల్లు క్లియర్! ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉండడంతో పాటూ పౌరులందరికీ ఇంటర్నెట్ సమాన యాక్సెస్ అందించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. దీనివలన ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీలను ఎవరూ చెల్లించక్కర్లేదు. By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దేశంలో వెనుకబడిన, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ విషయంలో సమాన హక్కు కలిగించే ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. దీని ఇక మీదట ఎవరైనా కానీ ఇంటర్నెట్ సౌకర్యాలను హాయిగా వాడుకోవచ్చును. దీని కోసం ఎవరూ ఎలాంట ఛార్జీలు చెల్లించక్కర్లేదు. 2023 డిసెంబర్లో సీపీఐ(ఎం) సభ్యుడు వి.శివదాసన్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఎగువ సభ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రపతికి తెలియజేసినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు తెలియజేశారు. బిల్లును సభకు పరిశీలించాలని సిఫారసు చేసింది. అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలోని పౌరులందరికీ ఇచ్చిన వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కు పరిధిని విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. సమాజంలో డిజిటల్ విభజనను తొలగించాలని కూడా బిల్లు భావిస్తోంది. ఇంటర్నెట్ చాలా ముఖ్య అవసర అయిపోయిన రోజుల్లో ఈ బిల్లు ఆమోదం ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. దీంతో పాటూ పౌరులందరికీ ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా కేంద్ర ప్రభుత్వం నేరుగా అందించాలని లేదా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ అందించే సేవలకు పూర్తిగా సబ్సిడీ ఇవ్వాలని పేర్కొంది. #free-wifi #government #internet #bill సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి