Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల

చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

New Update
Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల

Ap :చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ వెలువరించింది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‎లో భాగంగా జూనియర్ డివిజన్ బెంచ్‌ కు సంబంధించిన 39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఆన్ లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

వీటిలో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేయనుండగా మిగిలిన 7 పోస్టులను ట్రాన్స్ ఫర్ పద్ధతిలో నియమించనున్నారు. దీనికి గాను లా విద్యలో డిగ్రీ పట్టా పొంది వయసు 35 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ క్యాటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు వయోపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ పూర్తిగా ఆన్ లైన్ లో మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది.

జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తుకు రూ.1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకు గడువు 2024 జనవరి 31 నుంచి 2024 మార్చి 1 వరకూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా, వాయిస్ టెస్ట్ ఇలా వివిధ దశల్లో నిర్వహిస్తారు. వీటన్నింటిలో మంచి ప్రతిభ కనబరిచిన వారితో తుది జాబితాను విడుదల చేసి నియమకాలు చేపడుతారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అధికారులు అసలేం చేస్తున్నారు? మండి పడుతున్న భక్తులు!

తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
ttdslippers

ttdslippers

TTD:తిరుమలలో అపచారం జరిగింది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చేసినప్పటికీ గుర్తించకుండా సిబ్బంది నిద్రపోతున్నట్లున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించారు. మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన తర్వాత కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేదు.. భద్రత అధికారులు విఫలం అయ్యారు. ముగ్గరు భక్తులు పాదరక్షలు ధరించినట్లు తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం దగ్గర గుర్తించారు. వెంటనే పాదరక్షల్ని పక్కన విడిచి ఆలయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. 

Also Read: MLC Vijayasanthi: బజారుకీడ్చి అతి దారుణంగా చంపేస్తా..విజయశాంతి దంపతులకు బెదిరింపులు!

ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తులు మండిపడుతున్నారు. భక్తులు ఆలయంలోకి చెప్పులతో వస్తే సిబ్బంది ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొబైల్స్, నిషేధిత వస్తువులతో పాటు పాదరక్షలు కూడా లోపలికి తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందినే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: West Bengal: బెంగాల్‌లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం

సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లాలి. అక్కడ భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ మొబైల్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే వాటిని అక్కడే తీసుకుంటారు. ఆ తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కానీ తనిఖీల సమయంలో ఈ పాదరక్షల్ని గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

మహాద్వారం దగ్గర ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. దాంతో భక్తులు అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు. 

Also Read:  America -Trump: ట్రంప్‌ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌!

Also Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!

tirumala | slippers | devotees | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment