Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‎న్యూస్...పౌర సరఫరాల శాఖలో భారీగా ఉద్యోగాలు..పూర్తివివరాలివే.!!

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాజమహేంద్రవరంలోని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామానికి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్ధులను దరఖాస్తులను కోరుతోంది.

New Update
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

APSCSCL Jobs: రామహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత, ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము వంటి వివరాలను తెలుసుకోవాలి.

పోస్టుల వివరాలు :
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 - 12పోస్టులు

అర్హతలు:
బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ బాటనీ సబ్జెక్టులలో పాసై ఉండాలి.

వయస్సు:
35ఏళ్లు మించరాదు

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్సులను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఈ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:
డిసెంబర్ 05, 2023

ఎంపిక విధానం:
అకాడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

Notification PDF

Application PDF

ఇది కూడా చదవండి: మరో బ్యాంక్ పై ఆర్బీఐ కొరడా.. ఎలాంటి కఠిన చర్యలంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment