Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!

ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.

New Update
SBI PO Hall Tickets: స్టేట్ బ్యాంక్ పీఓ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ల విడుదలపై కీలక అప్టేట్..!!

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2వేలకు పైగా పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు సెప్టెంబర్ 7తో ప్రారంభం కాగా... సెప్టెంబర్ 27తో ముగియాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో కీలక అప్ డేట్ ఇచ్చింది ఈ ఎస్బీఐ. పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షకు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఖాళీల సంఖ్య:
2,000 పోస్టులు.

పోస్టుల కేటాయింపు:
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్‌- 200,
యూఆర్‌- 810.

అర్హతలు:
ఏదైనా డిగ్రీ

వయోపరిమితి:
01.04.2023 నాటికి 21 – 30 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:
రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్

ఎంపిక విధానం:
ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,
ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్,
ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

జీత భత్యాలు:
నెలకు రూ.41,960.

పోస్టుల కేటాయింపు:
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్‌- 200,
యూఆర్‌- 810.

అర్హతలు:

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
ఏప్రిల్ 1, 2023 నాటికి 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:
ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,
ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్,
ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

జీత భత్యాలు:

నెలకు బేసిక్‌ పే రూ.41,960.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:
చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

Advertisment
Advertisment
తాజా కథనాలు