Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అన్నాడు. ఇప్పటివరకూ అలాంటి నాయకుడు లేడని, 3ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్‌ ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ పొగిడేశాడు.

New Update
Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Gautam Gambhir on MS Dhoni: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అలాంటి నాయకుడు లేడని, మూడు ఐసీసీ ట్రోఫీలను (ICC Trophy) నెగ్గిన ఏకైక టీమ్‌ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అలాంటి సారథి లేడు..
ఈ మేరకు చెపాక్ వేదికగా కోల్‌కతా - చెన్నై (CSK Vs KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ మ్యాచ్ గురించి మాట్లాడిన వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘నేను ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటా. స్నేహితులైనా సరే పరస్పరం గౌరవించుకోవాలి. నేను కోల్‌కతా సారథిగా ఉన్నప్పుడు. ధోనీ సీఎస్‌కే కెప్టెన్. ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పుడు గెలుపు కోసమే కష్టపడతాం. ఇదే ప్రశ్న ధోనీని అడిగినా అతడు ఇదే చెబుతాడు. భారత క్రికెట్‌లో ధోనీ (MS Dhoni) అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటివరకు అలాంటి సారథి లేడు. మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్‌ఇండియా కెప్టెన్ అతనే అంటూ పొగిడేశాడు.

ఇది కూడా చదవండి: CM Revanth: సీఎం రేవంత్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

ఎప్పుడూ సవాలే..
అలాగే ఐపీఎల్‌లో ధోనీకి ప్రత్యర్థిగా బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ సవాల్‌ గానే ఉంటుంది. వ్యూహాలకు పదునుపెట్టే మైండ్‌సెట్‌ అద్భుతం. ఒక్కో బ్యాటర్‌కు ఎలా ఫీల్డింగ్‌ ను సెట్‌ చేయాలనేది అతడికి బాగా తెలుసు. చివరి బంతి వరకూ మ్యాచ్‌ను చేజారనివ్వడు. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్‌ను ముగిస్తాడు. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైనా భయపడదు. చెన్నై బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడమంటే కఠిన సవాలే. అయినా సరే విజయం సాధించేవరకూ పోరాడతామంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

New Update
meta

meta

అసలే ఒక పక్క అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దానికి తోడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇందులో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మీదనే ఏకంగా సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. జుకర్ బర్గ్ అమెరికా జాతీయ భద్రత గురించి ఆలోచించలేదని...అమెరికన్లను మోసం చేస్తున్నారని మెటాలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ అధికారుల చేతుల్లోకి వెళుతోందని అన్నారు. 

మెటా చైనాతో చేతులు కలిపింది..

మెటా ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కొంటోంది. గోప్యతా విధానం, అనైతిక వ్యాపా విలువలు లాంటి అంశాల్లో మెటా యూఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ వెట్ నెస్ గా మారి జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడే ఆయనపై విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కారని...అమెరికా విలువలకు ద్రోహం చేయండ తాను చూశానని విలియమ్స్ చెప్పారు. మెటా చైనీస్‌ ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుందని చెప్పారు. జుకర్ బర్గ్ అమెరికా దేశ భక్తుడు అని చెబుతారు కానీ చైనాలో 18 బిలియన్ డాలర్ల   వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకొంటున్నారని విలియమ్స్ ఆరోపించారు.

today-latest-news-in-telugu | meta | mark-zuckerberg

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

 

Advertisment
Advertisment
Advertisment