Gangster : గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన

కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.

New Update
Gangster : గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన

UPA Act : గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్(Lakhbir Singh) లాండా ...2021లో మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ మీద రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. 2022 డిసెంబరులో తరన్ తరణ్ లోని సర్హాలీ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. ఇవి కాక ఇంకా బోలెడు తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలకపాత్ర పోషించాడు. తరువాత ఇతను కెనడా పారిపోయి అక్కడ స్థిరపడ్డాడు. అక్కడి నుంచి కూడా భారత్ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో లఖ్బీర్ కు ప్రమేయం ఉంది. అందుకే అతనిని ఉపా చట్టం(UPA Act) కింద ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

Also Read:సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ

లఖ్బీర్ సింగ్ వయసు ౩౩ ఏళ్ళు. ఇతని స్వస్థలం పంజాబ్ లోని తరన్ జిల్లా. లఖ్బీర్‌ మీద దోపిడీ, హత్యలు, మాద ద్రవ్యాల సరఫరాలాంటి కేసుల్లో పంజాబ్‌తో పాటూ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్రిమెనల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలు కూడా లఖ్బీర్ చేశాడు. ఇతను 2017లో దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం లఖ్బీర్ ఖలీస్థానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదే కాక ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, గుపత్వంత్ సింగ్ పన్నూతో కూడా ఇతనికి సంబంధాలున్నాయి. వీటితో పాటూ గ్యాంగ్ స్టర్ హర్వీందర్ సింగ్ తో కూడా లఖ్బీర్ టచ్ లో ఉన్నాడని కేంద్ర హోంశాఖ తెలిపింది.

Also Read : 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్…ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!

ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్రం నుండి బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తానీ జాతీయులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

New Update
cm-yogi-Pakistan

cm-yogi-Pakistan

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది.  దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంతో పాటుగా సింధు జలాల రద్దు, పాక్ జాతీయులు వీసాలు రద్దు చేస్తూ కీలక ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 29వరకు ఎవరైనా పాకీస్థానీలు ఇండియాలో ఉంటే వెళ్లిపోవాలని ఆర్డర్స్ పాస్ చేసింది.  అక్రమంగా ఇండియాలో ఉంటే మాత్రం చర్యలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్లు చేసి హై అలర్ట్ ప్రకటించి, పాకిస్థానీయులను వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.  

ఉత్తరప్రదేశ్‌లో 1,000 నుండి 1,200 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పాకిస్తానీలను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు.  విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 27వ తేదీతో వీసాలు రద్దవుతాయి. మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుంది. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు పర్యాటకులు మరణించారు. 

హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు

తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో  వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ..  అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

 

Advertisment
Advertisment
Advertisment