IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

కోల్ కతా ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో టీమ్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కల సాకారం చేయడంలో శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపరిస్తే.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే.

New Update
IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2024 సీజన్ 17 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. మే 26న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తుది పోరులో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కప్ ను ముద్దాడింది. మొదటినుంచి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్ (KKR).. సన్ రైజర్స్ ను బ్యాటింగ్ లో కట్టడిచేయడంతోపాటు నిర్దేశించిన అత్యల్ప 113 స్కోర్ ను సునాయాసంగా చేధించింది. అయితే కేకేఆర్ విజయంలో మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు కీలక పాత్ర పోషించారు. అయితే కెప్టెన్‌గా 2012, 2014 కోల్ కతాకు ట్రోఫీలను అందించిన గంభీర్‌ రాకతో జట్టు దశ మారిందంటున్న క్రికెట్ విశ్లేషకులు.. వీరిద్దరి కలయికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అతడొచ్చిన తర్వాత జట్టు తీరు మారింది..
ఈ మేరకు కోల్ కతా కప్ గెలుచుకోవడంలో జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ది (Gautam Gambhir) కీలక పాత్ర ఉంది. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినప్పటికీ.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే. అతడొచ్చిన తర్వాత జట్టు తీరే మారిపోయింది. ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. పదేళ్ల కల సాకారంలో తనదైన బాధ్యతను నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్.. గంభీర్ ది అద్భుతమైన బుర్ర. నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలనే ఆలోచన ఆయనదే. అదే కోల్‌కతాకు అద్భుత ఫలితాలనిచ్చింది. నరైన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. వేలంలోనూ గంభీర్.. స్టార్క్‌ను ఎంచుకోవడం చాలా గొప్ప నిర్ణయం. జట్టులో ఆటగాళ్లందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మైదానంలోనే కాదు బయట కూడా ఆటగాళ్ల మధ్య రిలేషన్ పెంచాడు. అదే ఆ జట్టు విజయంలో కీలకమైంది. గంభీర్‌ వ్యూహాలు టోర్నీ మొత్తం ఎంతో ఉపయోగపడ్డాయంటూ పొగిడేశాడు.

ఇది కూడా చదవండి: Midday Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ!

శ్రేయస్‌ అయ్యర్‌ సమర్థ నాయకుడు..
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సమర్థ నాయకుడు అనడంలో సందేహంలేదని భారత మాజీ ఆటగాడు కైఫ్ అన్నాడు. కానీ కెప్టెన్‌గా అతడికి రావాల్సినంత గుర్తింపు దక్కలేదన్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్‌కు దూరమైనా.. ఈసారి జట్టును ముందుండి నడిపించాడు. శ్రేయస్‌కు మంచి భవిష్యత్ ఉందన్నాడు. ఇక గంభీర్‌ (Gautam Gambhir)సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. 'ఎవరి ఆలోచనలు, చర్యలు నిజాయితిగా ఆధారపడి ఉంటాయో.. వారికి శ్రీకృష్ణుడే రథసారథి' అంటూ తాత్వికతతో కూడిన పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

గతంలో కెప్టెన్‌గా కోల్‌కతా ఫ్రాంచైజీకి గంభీర్‌ రెండు ట్రోఫీలను (2012, 2014) అందించారు. ఈసారి తిరిగి మెంటార్‌గా జట్టు గూటికి చేరారు. తద్వారా పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఈ సందర్భంగా గెలుపులో గంభీర్‌ పాత్రను జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, వైస్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా కొనియాడారు. మరో కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్‌ సైతం గంభీర్‌ పాత్రను కొనియాడాడు. తన ఏడేళ్ల కల నెరవేరిందంటూ మొత్తం టీమ్‌తో పాటు ప్రత్యేకంగా గంభీర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment