Emmanuel Macron : మోదీతో కలిసి" చాయ్" తాగడం మర్చిపోలేను ..!!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ , భారత ప్రధాని మోదీ జైపూర్ నగరంలో వీరిద్దరూ కలిసి టీస్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల్లా టీ తాగారు. తర్వాత మక్రాన్ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోదీ యూపీఐ విధానం గురించి మక్రాన్ కు వివరించారు.

New Update
Emmanuel Macron : మోదీతో కలిసి" చాయ్" తాగడం మర్చిపోలేను ..!!

Emmanuel Macron : భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ (Emmanuel Macron)హాజరైన సంగతి తెలిసిందే. గురువారం ఆయన భారత దేశానికి వచ్చారు. రాజస్థాన్ లోని జైపూర్ సిటీని సందర్శించారు. జైపూర్ నగరంలో జంతర్ మంతర్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు. భారత పర్యటకు విచ్చేసిన మక్రాన్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటించారు. తొలిరోజు జైపూర్ లో ఆయన సందర్శించారు.

అయితే ప్రధాని మోదీ, మక్రాన్ ఇద్దరు కలిసి జైపూర్ నగరంలో టీ స్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల వలే చాయ్ తాగారు. తర్వాత మక్రాన్ యూపీఐ (UPI)ద్వారా డబ్బులు చెల్లించడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే ప్రధాని మోదీ యూపీఐ విధానం గురించి మక్రాన్ కు (French President) వివరించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు మక్రాన్ హాజరయ్యారు. అనంతరం ప్రసంగించారు. టీ అనేద హిందీ పదాన్ని ఉపయోగించి ప్రధాని మోదీతో కలిసి చాయ్ తాగడం మర్చిపోలేనని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: లాలూ ఫ్యామిలీకి..ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fruits: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

వేసవిలో పండ్లను కొన్ని సమయంలో పొర పాట్లు చేస్తారు. దానిమ్మ, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ నీటి శాతం ఉన్నవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గిస్తాయి. పండ్లు ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది.

New Update
Fruits sweet

Fruits sweet

Fruits: వేసవిలో పండ్ల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. శరీరానికి అవసరమైన తేమను కలిగి ఉండే పండ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే సరైన పండ్లను ఎంచుకోవడంలో చాలామంది పొర పాట్లు చేస్తుంటారు. ఫలితంగా ఇంటికి తీసుకువెళ్లిన పండ్లు పచ్చిగా ఉండడం, రుచి తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. దానిమ్మ వంటి పండ్లు కొనేటప్పుడు పైభాగం స్వల్పంగా తెరిచి ఉంటే అది తియ్యగా ఉన్నని భావించవచ్చు. మిగతా పండ్ల విషయంలో కూడా కొన్ని సరళమైన లక్షణాలను గమనించడం ద్వారా తియ్యని ఫలాలను ఎంచుకోవచ్చు. 

ఆకుపచ్చని ఆకులు ఉండాలి:

పుచ్చకాయకు చక్కటి చారలు, గట్టి పొడవైన ఆకారం ఉంటే అది ఎక్కువగా తీపిగా ఉండే అవకాశం ఉంది. అలాగే దానిని కొడితే ఖాళీగా అనిపించకూడదు. నారింజను కొనేటప్పుడు దాని రంగును గమనించండి. ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ విషయంలో కూడా ఆకుపచ్చని ఆకులు ఉండాలి. ఇది ఫలాన్ని తాజాగా ఉందని సూచిస్తుంది. 

ఇది కూడా చదవండి: వేసవిలో అమ్మాయిలు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి

బొప్పాయి విషయానికి వస్తే పూర్తిగా పసుపు రంగులో ఉంటే మాత్రమే తియ్యటి బొప్పాయి అని గుర్తించాలి. పచ్చని రంగులో ఉన్న బొప్పాయిలు ఎక్కువసార్లు పూర్తిగా పండవు. ఈ చిన్నచిన్న సూచనలతోనే మనం సరైన, రుచికరమైన పండ్లను ఎంచుకోవచ్చు. పైగా మార్కెట్‌కి వెళ్లే ప్రతిసారీ కాస్తంత గమనికతో చూస్తే డబ్బు కూడా వృథా కాదు. ముఖ్యంగా వేసవిలో మంచి నీటి శాతం ఉన్న పండ్లు తినడం శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్‌ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?

home-tips | home tips in telugu | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment