VC Sajjanar : అబ్బాయిలూ... మీక్కూడా స్పెషల్‌ బస్సులు.. సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు!

మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఇక రేపటి(డిసెంబర్ 9) నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవనుంది.

New Update
VC Sajjanar : అబ్బాయిలూ... మీక్కూడా స్పెషల్‌ బస్సులు.. సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు!

VC Sajjanar Key Comments to Boys : కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఆర్టీసీ(TSRTC) కి చెందిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. సీఎం ఆదేశాల మేరకు రేపు(డిసెంబర్ 9) మధ్యాహ్నం 1:30 నిమిషాలకు అసెంబ్లీలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్(Sajjanar). మంత్రులు ప్రజాప్రతినిధులతో పాటు బాక్సర్ నిక్కత్ జరిన్ పాల్గొంటారని చెప్పారు. ఇది ఒక్క హిస్టారికల్ డిసిషన్ అని కొనియాడారు. ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణాకు ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వాహనాలతో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ స్కీమ్‌తో మహిళలకు భద్రత కూడా ఉంటుందని చెప్పారు.

సజ్జనార్‌ ఇంకేం అన్నారంటే:
--> ఈ స్కీమ్ పల్లె వెలుగుతో పాటు.. ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వయసుతో పరిమితం లేకుండా ప్రయాణం చేయవచ్చు.

--> ట్రావెల్ సమయంలో ఏదైనా ఐడీ కార్డ్ చూపించాలి.

--> ఐడీ కార్డు చూపిస్తే జీరో టికెట్ ఇష్యూ చేస్తారు

--> రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి అయిన ప్రయాణం చేయొచ్చు

--> దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రెండు మూడు రోజుల్లో వస్తాయి.

ఆదాయం తగ్గుతుంది:
ఈ ఉదయం జూమ్ మీటింగ్ నిర్వహించి స్టాప్ అందరికీ సూచనలు తెలియజేశామన్నారు సజ్జనార్. బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ స్కీమ్ లో బాగంగా 7,292 బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీకి ఈ స్కీమ్‌తో ఏడాదికి 3వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజు వారి ఆర్టీసీ అదయం 14కోట్లు ఉండగా.. ఇది 7,కోట్లకు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారని సజ్జనార్‌ చెప్పారు. వచ్చే రోజుల్లో కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

సజ్జనార్‌ కీ పాయింట్స్:

--> రోజుకి 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది

--> కర్ణాటక పరిస్థితి ఇక్కడ రాకపోవచ్చు.

--> కర్ణాటకకి ఇక్కడికి చాలా తేడా ఉంది

--> అక్కడున్న బస్సులకు ఇక్కడికి డిఫరెన్స్ ఎక్కువ

--> ప్యాకేజీ సర్వీస్ కి ఇది వర్తించదు

--> ఛార్జీలు పెంచే అవకాశం లేదు

--> ప్రభుత్వం నుంచి కొన్ని బకాయిలు రావాల్సి ఉంది. అవి కూడా రిలీజ్ అవుతాయి

--> నిన్న సీఎం దృష్టికి విలీన అంశం తీసుకెళ్ళము

--> మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తాం.

Also Read: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment