Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషఖానా అనే కేసులో పాకిస్థాన్‌ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

New Update
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషాకానా అనే కేసులో పాకిస్థాన్ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. అంతేకాదు ఈ దంపతులు మరో 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా తీర్పునిచ్చింది. అలాగే 787 మిలియన్ల పాకిస్థాన్‌ రూపాయలు జరిమానా విధించింది.

Also Read: నన్ను ఒక సెక్సిస్ట్ గా చూశారు.. భారత చెస్‌ ప్లేయర్‌

ఇమ్రాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

అయితే నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు.. అధికారిక రహస్యాలు బయటపెట్టారనే కారణంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు షా మెహమూద్ ఖురేషీకి కూడా ‘సైఫర్’ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికల జరగనున్న వేళ.. మాజీ ప్రధాని, ఆయన భార్యకు జైలు శిక్ష పడటంతో అక్కడి రాజకీయాలు పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఇమ్రాన్‌ఖాన్‌కు (Imran khan) శిక్ష పడిన తర్వాత ఆయన పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (పీటీఐ)పై నిషేధం విధించే అవకాశం ఉందని పాక్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

పీటీఐని నిషేధిస్తారా ?

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రమేయం ఉన్న పీటీఐ వ్యవస్థాపకుడు, ఇతర నేతలపై తీర్పు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (PTI) నిషేధించడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పీటీఐకి నిధులపై అనేక సంవత్సరాల విచారణ తర్వాత పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP).. 2003 ఆగస్టులో పార్టీకి ‘నిషేధించబడిన నిధులు’ అందాయని గుర్తించింది. దీంతో ఇది పాక్‌ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నేతృత్వంలోని పాకిస్థాన్‌ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ప్రభుత్వానికి పార్టీని రద్దు చేయడానికి అవకాశం కల్పించింది.

Also Read: దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

New Update
Exercise Aakraman

పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. 

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. ఇండియన్ నేవీ కూడా గురువారం ఐఎన్ఎస్ సూరత్‌కు చెందిన ఓ క్షిపణి పరీక్షను విజయవంతం చేసింది. పాక్ సరిహద్దులో కరాచీ దగ్గర పాకిస్తాన్ కూడా ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయాణించే ఓ మిస్సేల్ టెస్ట్ నిర్వహించింది. ఇలా ఇరు దేశాలు సైనిక బలాబలాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితులు యుద్ధం రాబోందుంతా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. 

( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment