Foreign Investors: మన మర్కెట్స్ నుంచి విదేశీ ఇన్వెస్టర్స్ వెనకడుగు.. ఎందుకంటే.. 

 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) మన స్టాక్ మార్కెట్ల నుంచి విత్ డ్రా అవుతున్నారు. ఈనెలలో ఇప్పటివరకు వారు రూ.3,776 కోట్లను ఉపసంహరించుకున్నారు. వడ్డీరేట్లపై అనిశ్చితి, యూఎస్ లో బాండ్ల ద్వారా ఆదాయం పెరుగుతుండడం దీనికి కారణాలు 

New Update
Foreign Investors: విదేశీ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు..అదే కారణమా?

Foreign Investors: యుఎస్‌లో పెరుగుతున్న బాండ్ ఈల్డ్‌లు..  అదేవిధంగా  దేశీయ- గ్లోబల్ ఫ్రంట్‌లో వడ్డీ రేట్లపై అనిశ్చితి మధ్య, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి రూ.3,776 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ సమాచారం డిపాజిటరీ డేటా నుండి వచ్చింది. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు డెట్ లేదా బాండ్ మార్కెట్ విషయంలో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సమయంలో వారు బాండ్ మార్కెట్లోకి రూ.16,560 కోట్లను చొప్పించారు. డేటా ప్రకారం, ఈ నెలలో (ఫిబ్రవరి 16 వరకు) స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.3,776 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. అంతకుముందు జనవరిలో వీరు(Foreign Investors) షేర్ల నుంచి రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ ఏడాది వారి మొత్తం ఉపసంహరణ రూ.29,519 కోట్లకు చేరింది.

వినియోగదారుల ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో యుఎస్‌ బాండ్‌ రాబడులు పెరిగాయని, దీని కారణంగా ఎఫ్‌పిఐలు విక్రయదారులుగా కొనసాగుతున్నాయని నిపుణులు(Foreign Investors) చెబుతున్నారు.  ఇదే కాకుండా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో వడ్డీ రేట్లకు సంబంధించి అనిశ్చితి కూడా తాజా విక్రయాలకు కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ – మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

Also Read: పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!

డేటా ప్రకారం, అంతకుముందు జనవరిలో, ఎఫ్‌పిఐలు (Foreign Investors)బాండ్ మార్కెట్‌లో రూ.19,836 కోట్ల నికర మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్‌లో రూ.18,302 కోట్లు, నవంబర్‌లో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో రూ.6,381 కోట్ల నికర పెట్టుబడులు ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టారు.

సెప్టెంబర్ 2023లో, JP మోర్గాన్ చేజ్ & కో. జూన్, 2024 నుండి దాని బెంచ్‌మార్క్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య గత కొన్ని నెలలుగా దేశంలోని బాండ్ మార్కెట్‌లలోకి ఇన్‌ఫ్లోలను పెంచింది. ఇక 2023లో మొత్తం ఎఫ్‌పిఐ ఇన్‌ఫ్లోలు ఈక్విటీల్లోకి రూ.1.71 లక్షల కోట్లు.  డెట్ మార్కెట్‌లలోకి రూ.68,663 కోట్లుగా ఉన్నాయి. మొత్తంమీద క్యాపిటల్ మార్కెట్‌లో ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి రూ.2.4 లక్షల కోట్లు.

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు