Uttarakhand: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు!

ఉత్తర కాశీలో పది రోజులుగా టన్నెల్‌ లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి ఆహారం, అల్పాహారంతో పాటు మరికొన్ని అవసరమైన వస్తువులను అందించినట్లు అధికారులు వివరించారు.

New Update
Uttarakhand: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు!

పది రోజుల క్రితం ఉత్తర కాశీలోని టన్నెల్‌ కూలడంతో 41 మంది కార్మికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ కార్మికులు ప్రస్తుతం 6 అంగుళాల పైప్‌ లైన్‌ ద్వారా ప్రస్తుతం వారికి వేడి వేడి ఆహారాన్ని అధికారులు పంపించారు. తాజాగా వారు టన్నెల్లో ఉన్న చిత్రాలు కెమెరాకు చిక్కడంతో వెలుగులోకి వచ్చాయి. సొరంగం లోపల ఉన్న కార్మికులందరూ కూడా ఆరోగ్యంగానే కనిపించారు.

సొరంగంలో శిథిలాలు పడిపోవడంతో వారంతా 10 రోజులుగా చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్‌ కొత్త పైప్‌ లైన్‌ ని ఉపయోగించి కెమెరాను లోపలికి పంపింది. దానిలో వారంతా కూడా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వారిని ఇప్పుడు ప్రతి క్షణం బయట నుంచి మానిటర్ చేయవచ్చు. ముందు వారు ఉన్న ప్రదేశంలో లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

కెమెరా లోపలకు వెళ్లిన తరువాత దాని ముందు నిలబడిన కార్మికులంతా కూడా వాకీటాకీల ద్వారా మాట్లాడారు. బృంద సభ్యులందరూ సమీపంలో నిలబడి ఉన్నారు. వారంతా కూడా ఆరోగ్యంగా, ఫిట్‌ గా కనిపిస్తున్నారు. 10 రోజులుగా లోపల చిక్కుకుని ఉన్న కార్మికులకు సోమవారం రాత్రి వారికి ఆహారంగా కిచిడీ పంపారు.

దానిని బాటిళ్లలో నింపి పైపుల ద్వారా వారికి అందించారు. అంతేకాకుండా వారికి వేడివేడి అల్పాహారం సిద్ధం చేశారు. కార్మికులకు మొబైల్స్‌ తో పాటు మరికొన్ని ఉపయోగకరమైన వస్తువులను వారికి అందించినట్లు అధికారులు వివరించారు. ఆగర్‌ మిషన్‌ ద్వారా కార్మికులు ఉన్న టన్నెల్‌ లోకి ఇనుప పైపును అమర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also read: ఇద్దరమ్మల కడుపు పంచుకున్న బిడ్డ: కళ సాకారం చేసుకున్న స్పెయిన్ స్వలింగ జంట!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment