Mumbai: ఐఎన్ఎస్‌ బ్రహ్మపుత్రలో మంటలు

ముంబయ్ తీరంలో నిలిపిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నావికుడు కూడా గల్లంతయ్యారు.

New Update
Mumbai: ఐఎన్ఎస్‌ బ్రహ్మపుత్రలో మంటలు

INS Brahmaputra: ఐఎన్ఎస్ యుద్ధనౌక...భారతదేశం ప్రైడ్. ప్రస్తుతం ఇది ముంబయ్ డాక్‌యార్డ్‌లో ఉంది. దీనిలో అగ్ని ప్రమాదం చోటు చేసకుంది. ఈ ప్రమాదంలో షిప్ బాగా దెబ్బతింది. దాంతో పాటూ ఇందులో ఉన్న ఓ నావికుడు గల్లంతయ్యారు. ప్రస్తుతం అతని కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నౌకలో మిగతావారు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. మంటలు అంటుకున్న సమయంలో షిప్ ఒకపక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. అలా జరగడంలోనే నావికుడు మిస్ అయ్యారు. నౌకను సరైన స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అవ్వలేదు.

ఐఎన్ఎస్ యుద్ధనౌకను మరమ్మత్తుల కోసం ముంబయ్ డాక్ యారడ్‌లో పార్క్ చేశారు. ఆ పనులు జరుగుతుండగానే షిప్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక బృందాలు చాలాసేపు ప్రయత్నించిన మీద మటలను పూర్తిగా ఆపగలిగారు. ప్రస్తుతం నౌకను సరిగ్గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటూ అగ్ని ప్రమాదం మీద దర్యాప్తు చేస్తున్నారు. ఒక జూనియర్‌ నావికుడు మినహా మిగతా సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని.. గల్లంతైన నావికుడి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంటూ నౌకాదళం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment