Accident: బస్సును ఢీ కొట్టిన ఇన్నోవా కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి! గజ్వేల్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ని ఢీకొట్టి అదుపుతప్పి బస్సు, బైక్ ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ క్రమంలో బస్సులోని 10 మంది ఉద్యోగులు, బైకర్ శుబిదాస్కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 28 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Shamirpet Road Accident: అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలై, పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు రోడ్డు దిగువకు వెళ్లి, ఆగిపోవడంతో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది.ఈ యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డయ్యింది. గజ్వేల్ నుంచి హైదరాబాద్ కారు వస్తున్నక్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని 10 మంది ఉద్యోగులు, బైకర్ శుబిదాస్కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి! #hyderabad #shamirpet #road-accident #crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి