Delhi Capitals : భారీ స్కోరు తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ...

New Update
Delhi Capitals : భారీ స్కోరు తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ...
IPL 2024 : ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.

ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా... ఆఖర్లో ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెక్ గుర్క్, పోరెల్ జోడీ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించింది. మెక్ గుర్క్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయగా, పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు.

షాయ్ హోప్ (1), అక్షర్ పటేల్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (15) ఆశించిన మేర రాణించలేకపోయారు. ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ విరుచుకుపడడంతో ఢిల్లీ స్కోరు 200 మార్కు దాటింది. స్టబ్స్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు.

ఐపీఎల్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1, చహల్ 1 వికెట్ తీశారు.

Also Read : పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment