Malla Reddy: కేసీఆర్ ఇంట్లో మూడు పదవులు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తన కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నానని మల్లారెడ్డి అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి రేవంత్‌కు భజన చేస్తున్నారన్నారు

New Update
Malla Reddy: కేసీఆర్ ఇంట్లో మూడు పదవులు.. మల్లారెడ్డి  సంచలన వ్యాఖ్యలు

Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి సొంత పార్టీ అధినేత కేసీఆర్ (KCR) పై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నామని అన్నారు. అయితే.. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) చిచ్చులు పెట్టాయి. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

నా కొడుక్కి ఎంపీ టికెట్...

తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచిన.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కుంగిపోకుండా రాబోయే లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కీలక విషయాలు వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి (Bhadra Reddy) మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ కూడా తన కొడుక్కి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించక ముందే మల్లారెడ్డి (Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయతీకి తెర లేపినట్లయింది.

Also Read: రైతులకు గుడ్ న్యూస్…సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

జగ్గారెడ్డి భజన కార్యక్రమం...

కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై (Jaggareddy) సెటైర్లు వేశారు మల్లారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయినా జగ్గారెడ్డి.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫెమస్ కావడం కోసం తన పేరు ఎత్తుతున్నారని అన్నారు. తన పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరని చురకలు అంటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment