KTR: ఈ నెల 12న కరీంనగర్‌లో బహిరంగ సభ: కేటీఆర్‌

తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 12న కరీంనగర్‌లో 'కదన భేరీ' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

New Update
Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) పై బుధువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈరోజు (మంగళవారం) కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్‌ నేతలో ఆయన సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటోందని విమర్శలు చేశారు. డిసెంబర్‌ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ మాట తప్పారని మండిపడ్డారు.

Also Read: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

కదన భేరీ సభ

మరోవైపు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై కూడా కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌.. కరీంనగర్‌కు చేసిందేమి లేదని విమర్శలు చేశారు. మతం, అయోధ్య పేర్లతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని విమర్శలు చేశారు. అయితే ఈ నెల 12న కరీంనగర్‌లో 'కదన భేరీ' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ VS కాంగ్రెస్

ఇదిలాఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. మరోవైపు మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టి ప్రయాత్నాలు చేస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్‌తో.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇటీవల పలు సర్వేలు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రానున్నట్లు అంచనా వేశాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈనెలలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కూడా రానుంది. మరీ తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Also Read: ‘బడే భాయ్’ అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment