Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్ను పోలీసులు అరెస్టు చేశాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన అతడిని ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. By B Aravind 08 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్ను పోలీసులు అరెస్టు చేశాడు. విదేశాల నుంచి సోమవారం హైదరాబాద్కు వచ్చిన రహీల్ను ఎయిర్పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రహీల్ స్థానంలో మరో డ్రైవర్ను చేర్చారు. అనతంరం రహీల్ దుబాయ్కి పారిపోయాడు. Also Read: యూట్యూబ్ ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన టీచర్ రహీల్పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు దుబాయ్ పారిపోవడంతో.. అతడిపై లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు రహీల్ హైదరాబాద్కు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే అయిన షకీల్ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. Also Read: లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిలా..? జైలా..? #telugu-news #brs-ex-mla-shakeel #telangana-news #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి