Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ !

మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్‌ బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ !

ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్రమంత్రి పదవి రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు ఈ పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా.. కిషన్‌ రెడ్డి పొలిటికల్‌ జర్నీ

ఈటల రాజేంధర్‌ బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని బీజేపీ మార్చనున్నట్లు సమాచారం.

Also Read: నీట్ పేపర్‌ లీక్‌ అయ్యిందా ? అసలేం జరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు