Breaking : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

New Update
Breaking : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్

MLC Elections 2024 : ఏపీ (Andhra Pradesh) లో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ (EC) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికలను 12న నిర్వహింనుంది ఈసీ. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. వైసీపీ (YCP) నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీ (TDP) లో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌ రాజు రామచంద్రయ్య అనర్హత వేటు వేశారు.

మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పై సైతం వేటు పడింది. దీంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక నోటిఫికేషన్ (MLC Election Notification) విడుదలైంది. అయితే.. ప్రస్తుతం అసెంబ్లీలో మారిన బలాల దృష్ట్యా కూటమికే ఈ రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో అనేక మంది పొత్తుల్లో భాగంగా తమ సీట్లను త్యాగం చేశారు.

దీంతో వారంతా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్యం కోసం పోటీ పడే అవకాశం ఉంది. వీరిలో పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన ఉమ్మడి ఖాతాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది.

Also Read : ప్రసవవేదనలో శ్రీకృష్ణ గానామృతం..ఆ తల్లి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment