Renu Desai: ప్లీజ్.. చిరాకు తెప్పించకండి: పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్!

జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలుపించుకోవడం అకిరాకు ఇష్టముండదని రేణూ దేశాయ్ చెప్పింది. 'అకిరా ఎప్పుడు నటిస్తాడా? అని నాకూ అతృతగా ఉంది. అకిరా సినీ ఎంట్రీపై ఇప్పుడే చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి' అంటూ ఫ్యాన్స్ ను రేణూ రిక్వెస్ట్ చేసింది.

New Update
Renu Desai: ప్లీజ్.. చిరాకు తెప్పించకండి: పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్!

Pawan kalyan: జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలుపించుకోవడం అకిరాకు, పవన్ కు కూడా ఇష్టముండదని రేణూ దేశాయ్ అన్నారు. పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో అకిరా.. తన తండ్రి పవన్ వెంటే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అకిరాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అకిరా అరంగేట్రం, తదితర అంశాలపై పవన్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తుండగా.. కొందరి కామెంట్లపై రేణూ దేశాయ్ స్పందించారు. అకిరాకు కాని, ఆయన తండ్రి పవన్ కు కానీ జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదని చెపపారు. మీ ఫీలింగ్స్‌ను అకిరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ కు సూచించారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

'అకిరా పుట్టినప్పటినుంచి నేను అతనికి అభిమానినే. అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు ఎంతో అతృతుగా ఉంది. అయితే అంతకంటే ముందు నేను ఆయన తల్లిని. అతను ఏ నిర్ణయం తీసుకున్న గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అకిరా సినీ ఎంట్రీపై చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి' అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

ఆయనకే ఫోన్ చేసి చెబుతా..
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేణు దేశాయ్ సందడే కనిపిస్తుంది. పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను వరుసగా పోస్టులు పెడుతుంది. నాన్న విన్నింగ్ మూడ్‌లో అకిరా, ఆద్య అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్, అకిరా నందన్ కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. దీంతో రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనైంది. అకీరా పీఎం వద్దకు వెళ్లడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇక వపన్ అన్నయ్య గురించి ఏమైనా చెప్పొచ్చు కదా వదిన గారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నించగా.. మళ్లీ నేను ఏం చెప్పినా అందరూ అటెన్షన్ కోసమే మాట్లాడుతున్నాను అంటారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెబుతాను కాబట్టి, మీరందరూ సంతోషంగా ఉండండి అని రిప్లే ఇచ్చింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

New Update
deeika

deeika

 


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌ ఇటీవల కశ్మీర్‌ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్‌ స్టాలో పంచుకున్నారు.

కశ్మీర్‌ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్‌ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్‌ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్‌ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు. 

మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్‌ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.

ఈ పర్యటన పై వ్లాగ్‌ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్‌ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.  పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు.   వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news

Advertisment
Advertisment
Advertisment