Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు?

అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను శివరాత్రి వరకూ అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో 20 లక్షమంది దరఖాస్తు పెట్టుకోగా.. ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం.

New Update
Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు?

Ration Card : తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు(Ration Cards) లనే ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా లబ్దిదారులకు పథకాలను అందించేందుకు కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు..
ఈ మేరకు లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రి(Shivaratri) నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలన్నది రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుందని, ఇందుకు సంబంధించి అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వారి సంఖ్య అధికం..
ఇక ఇటీవల స్వీకరించిన ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. రేషన్ కార్డులు, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ముఖ్యంగా ఐదు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి : Golden Globes : ‘గోల్డెన్‌ గ్లోబ్‌’అవార్డ్స్’.. సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్’

అలాగే దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కోటి పది లక్షల దరఖాస్తులు..
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6వ తేదీతో ముగిశాయి. అయితే.. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను తీసుకున్నారు. దీనిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను ఆహ్వానించలేదు. మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఏది ఏమైనా రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఈ నెలాఖరుకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment