/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/google-1-jpg.webp)
కరోనా వచ్చిన తరువాత ప్రముఖ టెకీ కంపెనీలన్ని కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకుతున్నాయి. చిన్న చిన్న కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పని చేశాయంటే అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ పనిని చేస్తున్నాయి. ఇలా ఉద్యోగులను తొలగించడంలో గూగుల్ (Google) టాప్ లిస్ట్ లో ఉంది.
గూగుల్ ఈ ఏడాదిలో 12 వేల మందిని కంపెనీ నుంచి తొలగించింది.దీని గురించి సుందర్ పిచాయ్ (Sundarpichay) ఇటీవల ఓ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. తమ కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ చెప్పుకొచ్చారు. ఆర్థికంగా టాప్ పొజిషన్లో ఉండడంతో పాటు..కంపెనీ పొజిషన్ ని మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
అయితే ఉద్యోగం నుంచి తొలగించిన తరువాత చాలా మంది కంపెనీ ఉద్యోగులు సోషల్ మీడియాలో (Social media) తమ ఆవేదనను తెలియజేస్తూ పోస్ట్ లు పెట్టారు. ఇది తమ జీవితంలో చాలా కష్టమైన ఫేజ్ అని పేర్కొన్నారు. దీని గురించి సుందర్ పిచాయ్ స్పందించారు. కంపెనీకి వేరే అవకాశం లేక ఇలా చేయాల్సి వచ్చిందే కానీ..మాకు ఎవరి మీద కోపం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో మేము ఆ కఠిన నిర్ణయాన్ని కానీ తీసుకుని ఉండకపోతే..కంపెనీ చాలా నష్టపోయేదని తెలియజేశారు. అయితే లే ఆఫ్ ల విషయంలో మా కంపెనీ కూడా కొన్ని పొరపాట్లు చేసింది. దానిని నేను అంగీకరిస్తున్నాను. అది కాస్త పద్దతిగా జరిగి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.
లే ఆఫ్ లు జరిగిన తరువాత ఆ ప్రభావం కంపెనీ మీద కచ్చితంగా ఉంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని వివరించారు. ఏ సంస్థకైనా ఇలాంటివి ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని తెలిపారు. గడిచిన 25 సంవత్సరాల్లో గూగుల్ ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని తెలియజేశారు.
కంపెనీ కానీ లే ఆఫ్ ల విషయం లో ఏ మాత్రం ఆలస్యం చేసిన కంపెనీకి భారీ నష్టం కలిగేదని వివరించారు. ఏడాది కాలం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. వాటిని అన్నిటిని అధిగమించడానికి కంపెనీ ప్రయత్నిస్తుందని వివరించారు.
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్పై మూత్రం పోసిన వ్యక్తి
KTR : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
nari nari naduma murari: ఏముంది భయ్యా సాంగ్.. శర్వా కొత్త మూవీ పాట అదిరిపోయింది..