Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్‌లకు షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు!

ఏపీలో వెయిటింగ్‌లో ఉంటూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు. వారంతా ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలన్నారు.

New Update
Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్‌లకు షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు!

DGP Dwaraka Tirumala Rao: ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు బిగ్ షాకిచ్చారు. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని సూచించారు. ప్రతిరోజూ హెడ్‌ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఇలా మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వెయిటింగులో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల జాబితా 
సునీల్ కుమార్
సంజయ్
కాంతి రాణా
కొల్లి రఘురామిరెడ్డి
విజయరావు
విశాల్ గున్నీ
PSR ఆంజనేయులు
అమ్మిరెడ్డి
రవిశంకర్ రెడ్డి
రిషాంత్ రెడ్డి
రఘువీరా రెడ్డి
పరమేశ్వర్ రెడ్డి
జాషువా
కృష్ణ కాంత్ పటేల్
పాలరాజు

Also Read: ఎన్టీఆర్ కు యాక్సిడెంట్.. టీమ్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు