Pawan kalyan: వరద ప్రాంతాల్లో అందుకే పర్యటించలేదు: పవన్ కల్యాణ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు. తాను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పారని.. అందుకే రాలేకపోయానని స్పష్టం చేశారు.

New Update
Pawan kalyan: వరద ప్రాంతాల్లో అందుకే పర్యటించలేదు: పవన్ కల్యాణ్

ఏపీలో వరద ప్రభావం వల్ల విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కనిపించడం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో దీనిపై తాజగా ఆయన స్పందించారు. తాను ముందుగా పర్యటించాలని అనుకున్నానని.. కానీ అధికారులు తాను పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలగుతుందని చెప్పారని తెలిపారు. అందుకే తన పర్యటనను విరమించుకున్నట్లు స్పష్టం చేశారు. తన పర్యటన బాధితులకు సాయపడేలా ఉండాలి తప్ప అదనపు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read : మరింత పెరగనున్న హైదరాబాద్.. జీహెచ్ఎంసీలో 51 గ్రామాలు విలీనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు