Crime News: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ

ఢిల్లీలోని ఓ యువతి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేయడం కలకలం రేపింది. చెల్లి పెళ్లి కోసం దాచిన లక్షల రూపాయల విలువైన నగలు, నగదును కాజేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటెజ్‌లతో ఇంట్లోకి వెళ్లిన కూతురును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

New Update
Crime News: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ

ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేసింది. చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు, నగలను స్వాధీనం చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 30న ఉత్తమ్‌ నగర్‌కు చెందిన కమలేష్ అనే మహిళ పోలీస్ స్టేషకు వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో తాను ఇంట్లో లేనప్పుడు బీరువాలో దాచి ఉంచిన లక్షలాది రూపాయల విలువైన నగలు, రూ.25 వేల నగదు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసింది.

పెద్ద కూతురే దొంగ

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమలేష్ ఇంటిని పరిశీలించారు. అయితే ఆ ఇంటి మెయిన్‌ డోర్, బీరువా చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ ఇంట్లోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లలేదని భావించారు. చివరికి ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీని ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే ఓ మహిళ బురఖా ధరించి ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపించింది. ఆమె ఎవరో కాదు కమలేష్ పెద్ద కూతురు శ్వేత(31)గా పోలీసులు గుర్తించారు.

Also read: అసెంబ్లీకి రా చూసుకుందాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్

ఇంటి తాళాలు నొక్కేసింది

శ్వేతను అదుపులోకి విచారించారు. కొంతకాలంగా తల్లి దగ్గరే ఉంటున్న శ్వేత అప్పులపాలైంది. జనవరిలో ఆమె తన తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు చెల్లి పెళ్లి కోసం దాచిన నగలను దొంగిలించాలని అనుకుంది. ఇందుకోసం ప్లాన్ వేసింది. జనవరి 30న శ్వేత తన తల్లి ఇంటికి వచ్చింది. సమయం చూసి తల్లి వద్ద ఉన్న ఇంటి తాళాలు దొంగిలించింది. కూరగాయాలు తీసుకొస్తా అనే సాకుతో బయటకు వెళ్లింది.

కానీ పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్లి బురఖా వేసుకుంది. ఆ తర్వాత తల్లి ఇంటికి వెళ్లింది. తన దగ్గర ఉన్న తాళంతో డోర్‌, లోపల్ ఉన్న బీరువా తెరచి.. లక్షల విలువైన నగలు, రూ.25 వేలు కాజేసింది. చివరికి పోలీసులు ఆమెను గుర్తించడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. అయితే నగలు అమ్మేసినట్లు శ్వేత చెప్పగా.. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also read: యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bharat Bhushan: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

New Update
 Bharat Bhushan

Bharat Bhushan

పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

దయచేసి నన్ను వదిలేయండి

భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment