Arvind Kejriwal : నా భర్తకు మద్దతు ఇచ్చేందుకు ఈ నెంబర్‌కు మెసేజ్‌ చేయండి : సునీతా

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ నియంత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన సతీమణి సునీతా అన్నారు. ఆయన కోసం 8297324624 వాట్సప్‌ నెంబర్‌కు మీ సందేశాలు పంపించాలని.. మీ ప్రేమ, ఆశీర్వాదలను ఆయనకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.

New Update
Kejriwal: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!

Sunita : లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) లో అరెస్టయిన ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ప్రస్తుతం ఈడీ(ED) కస్టడిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal) మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాటం చేస్తున్నారని.. ఇందుకోసం ఆయనకు అండగా నిలబడేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. అంతేకాదు ఓ వాట్సప్‌ నెంబర్‌ను కూడా షేర్‌ చేసి దీనికి మీ సందేశాలు పంపిచండని తెలిపారు.

Also Read : చిరకాల ప్రత్యర్థిపై చేసిన ట్రిపుల సెంచరీకి 20 ఏళ్లు!

' నా భర్త అసలైన దేశభక్తుడు. కోర్టులో నిజాలను బయటపెట్టాలంటే చాలా ధైర్యం అవసరం. ఇప్పుడు దేశంలో ఉన్న నియంత శక్తులకు సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతం మనమందరం ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు నుంచి మేము ఓ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనున్నా. అరవింద్ కేజ్రీవాల్‌ కోసం 8297324624 వాట్సప్‌ నెంబర్‌కు మీ సందేశాలు పంపించండి. అవన్నీ కూడా నేను ఆయనకు చేరవేరుస్తాను. మీరు చూపించే ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారని' సునిత వీడియో సందేశంలో వివరించారు.

ఇదిలా ఉండగా.. లిక్కర్‌ పాలసీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతితో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతో మాత్రమే తనను అరెస్టు చేశారని అన్నారు. అలాగే సునీత కేజ్రీవాల్‌ కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం బాలేదని.. అలాగే ఈడీ అధికారులు కూడా ఆయనను వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్‌, కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment