Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్!

వరంగల్‌‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

New Update
Warangel

ఇటీవల వచ్చిన ఓ సినిమాలో ఇంటి మేడ పైన గంజాయి మొక్కలను పెంచుతున్న సీన్ నిజ జీవితంలోనూ జరిగింది. వరంగల్‌లో పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చి చెకింగ్‌లు చేస్తుండగా వారికి ఊహించిని షాక్ కనిపించింది. వరంగల్ సిటీలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులు కొత్తగా స్నీఫర్ డాగ్‌ను తీసుకొచ్చారు. దీన్ని తీసుకుని వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా.. ఆ స్నీఫర్ డాగ్ ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది.

ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?

పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు..

ఒక అతని ఇంటి మేడ వైపుకు పరిగెత్తింది. దీంతో పోలీసలు ఈ జాగిలం కొత్తది కావడం వల్ల గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ మేడ ఎక్కిన తర్వాత వారు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ ఉద్యోగం చేస్తూనే, ఇంకా డబ్బులు సంపాదించాలని ఇంట్లోనే మేడపైన పూలకుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.

ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. దీంతో అతని యవ్వారం బయటపడింది. వెంటనే పోలీసులు ఆ గంజాయి మొక్కలను పెంచుతున్న యజమానిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

డబ్బు కోసమే ఇలా చేసినట్లు తెలిపాడు. వెంటనే అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేశారు. నగరంలో ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నా, అక్రమంగా కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్న, విక్రయిస్తున్న కూడా తక్షణమే 8712584473 ఈ నంబర్‌కు సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment