Crime: ఎఫ్ఫైర్ గురించి నిలదీసినందుకు భార్యను కిరాతకంగా కొట్టి.. చివరికి ఏం చేశాడంటే?

విజయవాడ గుణదలలో దారుణం చోటుచేసుకుంది. శిరీష అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త వెంకట్రావును అక్రమసంబంధం గురించి నిలదీయడంతో అతడే చంపాడని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. శిరీష విద్యాభారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

New Update

Crime: వివాహేతర సంబంధం గురించి  నిలదీసినందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన విజయవాడ జిల్లా గుణదలలో చోటుచేసుకుంది. మల్లపు శిరీషకు అనే మహిళకు కొన్నేళ్ళ క్రితం  వెంకట్రావుతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే  నిన్న శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో అతడే శిరీషను చంపాడని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.  శిరీష చావుకు భర్త వెంకట్రావే కారణమని ఆందోళనకు దిగారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. శిరీష విద్యాభారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. 

ఇటీవలే మలక్ పేట్ లో మరో శిరీష

ఇది ఇలా ఉంటే.. ఇటీవలే మలక్ పేట్ లో మరో శిరీష భర్త, ఆడపడుచు చేతిలో దారుణ హత్యకు గురైంది. తన వివాహేతర సంబంధాల గురించి తెలిసిన శిరీష ఎప్పటికైనా ప్రమాదమని భావించిన ఆడపడుచు శిరీషకు మత్తు మందు ఇచ్చి చంపింది. అక్కకు తోడుగా తమ్ముడు కూడా చేరి కట్టుకున్న భార్యను హతమొందించారు. 

అయితే ఆడపడుచు సరిత భర్త విదేశాల్లో ఉండటంతో సరిత అక్రమ సంబంధాలు పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం శిరీషకు కూడా  తెలియడంతో.. ఓ సారి సరితో గొడవ జరిగిన సమయంలో నీ అక్రమ సంబంధాల చరిత్ర గురించి అందరికీ చెప్తాను అని కోప్పడింది. దీంతో శిరీష ఉండడం తనకు ఎప్పటికైనా ప్రమాదమని భావించిన సరిత..  శిరీషను అంతమొందించాలని ఫిక్స్ అయింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు . శిరీష చనిపోయాక అక్క, తమ్ముడు ఇద్దరూ  కలిసి ఆమెకు గుండెపోటు వచ్చిందని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అయితే శిరీష మేనమామ మధుకర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు వినయ్‌, సరితలను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nightclub Roof Collapses : కూలిన నైట్ క్లబ్..150 మంది స్పాట్ లోనే...

నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు. 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Dominican Republic Nightclub Roof Collapses At Club

Dominican Republic Nightclub Roof Collapses At Club

Nightclub Roof Collapses : నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు, 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 12:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


క్లబ్ లో మెరెంగే సింగర్ రూబీపెరెజ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రూబీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక సారిగా భారీ శబ్ధంతో రూప్‌ కూలిపోవడంతో అప్పటివరకు ఆనందంతో కెరింతలు కొడుతున్న వారంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


ఈ ప్రమాదంలో రూబీ పెరెజ్‌ గాయపడడంతోపాటు ఆయన బృందలోని శాక్సోఫోనిస్ట్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్‌లో ప్రమాదం జరిగన సమయంలో  సుమారు 500 నుండి 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. 400 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా  జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని కానీ ఈ రోజు ప్రమాదం జరగడానికి కారణం ఏంటని మాత్రం తెలియరాలేదు. రూప్‌ బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్న వాదన వినపడుతోంది.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment