ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..

ఉత్తరప్రదేశ్‌లో 22 ఏళ్ల దళిత యువతిని అతి కిరాతకంగా చంపిన ఘటన చోటుచేసుకుంది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఇంతలో మృతదేహం గ్రామ కాలువలో లభ్యమైంది. కాలు విరగొట్టి, కళ్లు పీకేసి అతి కిరాతకంగా ఆమెను చంపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

New Update
uttar

uttar Photograph: (uttar)

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య గ్రామ సమీపంలోని నిర్జన కాలువలో 22 ఏళ్ల దళిత యువతి మృతదేహం శనివారం లభ్యమైంది. ఆమె శరీరంపై లోతైన గాయాలు ఉండటంతో పాటు కళ్లు కూడా కనిపించకుండా ఉన్నాయి. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శరీరానికి తాడులు కట్టి ఉండటంతో పాటు శరీరంపై ఎక్కువగా కత్తి కోతలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!

ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

కాలు విరగొట్టి అతి కిరాతకంగా..

ఆమె కాలు కూడా విరగొట్టారు. చాలా భయంకరంగా ఆమెను హత్య చేశారు. ఈ మృత దేహాన్ని చూసిన ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మూర్చపోయారు. అయితే యువతి కనిపించడం లేదని శుక్రవారం ఫిర్యాదు అందిందని, ఇంతలోనే శవం కనిపించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!

ఇదిలా ఉండగా ఆ దళిత బాలికకు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని సమాజ్ వాద్ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ అన్నారు. ఆ యువతికి ఇలా జరగడం బాధాకరమన్నారు. ఆమెకు తప్పకుండా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దీంతో అయోధ్య ప్రజలు అవదేశ్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రతీ ప్రాంతానికి ఇలాంటి నాయకుడు తప్పకుండా కావాలని అంటున్నారు.  

ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment