Uttar Pradesh: దొంగలుగా మారిన బీఎస్సీ విద్యార్థినులు.. ఆ ఇళ్లే టార్గెట్

ఉత్తరప్రదేశ్‌లో బీఎస్సీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రూ.7.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కాజేశారు. షూ రాక్‌లో ఉన్న తాళం తీసి ఇంట్లోకి చోరబడి ఈ నగలు కొట్టేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ ఇద్దరు విద్యార్థినులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.

New Update
College girls Theft in Uttarpradesh

College girls Theft in Uttarpradesh

కాలేజీ విద్యార్థినులు చదువుకోకుండా దొంగలు మారిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇద్దరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లకుండా ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. ఆ ఇంట్లో నుంచి రూ.7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు. బరేలీలోని షీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు బీఎస్సీ చదువుతున్నారు.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

షూ రాక్‌లో ఉన్న తాళం తీసి..

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఎవరైతే ఇంటి తాళం షూ రాక్‌లో ఉంచుతారో అలాంటి ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఓ కొడుకు తల్లికి కాల్ చేసి షూ రాక్‌లో ఇంటి తాళం ఉంచామని చెప్పడంతో అది విని ఈ ఇద్దరు విద్యార్థినులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు అన్ని కూడా తీసుకొచ్చారు.

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

ఆ తల్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నగలు కనిపించలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఇద్దరు విద్యార్థినులు దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషీయల్ కస్టడీలో ఉంచారు. 

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు