యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. దుర్గామాత వేడుకల్లో మొదలై..!

యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

author-image
By srinivas
New Update
ddfdere r

Encounter: భారత్‌లోని ఉత్తర్‌ప్రదేశ్‌ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. యూపీ బహ్రెయిచ్‌ జిల్లాలోని అక్టోబర్ 13న దుర్గా మాత నిమజ్జన కార్యక్రమంలో ఉద్రిక్తతలు ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఒ వ్యక్తి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. ఈ మేరకు దుర్గమాత నిమజ్జనంలో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టొద్దని, ఇబ్బందిగా ఉందని చెప్పిన వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దురుసుగా ప్రవర్తిస్తూ రామ్‌ గోపాల్ మిశ్రాపై దాడి చేసిన యువకులు చివరికి గోపాల్ మిశ్రాను కాల్చి చంపేశారు. అనంతరం నేపాల్ పారిపోతుండగా.. నిందితులను పట్టుకునే క్రమంలో STF పోలీసులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితులు సర్ఫరాజ్‌, ఫహిమ్‌కు గాయాలైనట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: డకౌట్‌లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు!

ఈ నేపథ్యంలో మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్‌ కొడుకు సర్ఫరాజ్‌ హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఇక కేసు విచారణలో డీజే సౌండ్ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా బహ్రెయిచ్ జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

రెహువా మన్సూర్ గ్రామానికి చెందిన బాధితుడు రామ్ గోపాల్ మిశ్రా కుంటుంబానికి న్యాయం చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. మిశ్రా కుటుంబాన్ని ఆఫీసుకు పిలిపించుకుని తప్పకుండా న్యాయం చేస్తామని యోగి చెప్పారు. పోలీస్ స్టేషన్ ముందు బాధితుడి బంధువులు ఆందోళనకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చదవండి:'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా!

ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayawada: ఛీ ఛీ రిలేషన్‌కు అడ్డుగా ఉందని.. మూడేళ్ల కుమార్తెను దారుణంగా!

విజయవాడలో ఉంటున్న ఓ వివాహిత మహిళ భర్తకి దూరంగా మూడేళ్ల కూతురితో కలిసి ఉంటుంది. ఆమె శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీనికి కూతురు అడ్డుగా ఉందని ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసింది.

New Update
Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

crime news

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కుమార్తెకు చిత్రహింసలు పెట్టిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ రాములు అనే వ్యక్తితో విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహిత మహిళ భర్త ఒక ఆటో డ్రైవర్. వ్యక్తిగత కారణాలతో విడిపోయి మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది.

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

మూడేళ్ల పాప అడ్డుగా ఉందని చిత్రహింసలు చేసి..

ఈ క్రమంలో శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటుందని ఇద్దరూ కలిసి పాపను చిత్రహింసలకు గురిచేశారు. ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసిన విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను తీసుకుని విజయవాడకు వచ్చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

గుజరాత్‌లో ఘోరం జరిగింది. సూరత్‌లోని ధర్మశాలలోని జైన సన్యాసి మైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు ధర్మశాలకు చెందిన కళాశాలలోని 19ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

ఈ కేసులో జైన దిగంబర్ శాఖకు చెందిన సన్యాసికి సూరత్‌లోని సెషన్స్ కోర్టు శనివారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో శాంతిసాగర్ జీ మహారాజ్ దోషిగా తేలడంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఏకే షా నిందితుడికి రూ.25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

 

vijayawada | telugu-news | Latest crime news | telugu crime news | today-news-in-telugu | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment