/rtv/media/media_files/2025/02/07/yEUqGIBxstnZPd4J0zwE.jpg)
suryapeta incident
అతడు ఒక ప్రభుత్వ టీచర్ (Government Teacher).. కానీ పేరులో ఉన్న ఆ ఉన్నతం అతడిలో లేదు. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆమె కూతుళ్లపై పై కూడా హత్యాచారానికి తెగబడ్డాడు. తల్లికి తెలియకుండా రెండేళ్లకు ఆమె కూతుళ్లపై హత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. ఇంతలో అతడికి HIV పాజిటివ్ అని తేలింది. దీంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. కూతుళ్లపై పై కూడా అత్యాచారం చేస్తున్నాడని తెలుసుకున్న సదరు మహిళా ఆ కామాంధుడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం వెలుగు చూసింది.
తల్లీ కూతుళ్లతో వివాహేతర సంబంధం
పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కు చెందిన అతడు స్థానిక హై స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొన్నేళ్ళ క్రితం అతని భార్య చనిపోయింది. ఈ క్రమంలో అతడికి అదే సూర్యాపేటకు చెందిన ఓ మహిళతో 2018లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీనం వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆమె భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. అయితే ఓ వైపు తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె ఇద్దరు కూతుళ్ల పై కూడా కన్నీశాడు ఈ కామాంధుడు.
Also Read : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
HIV పాజిటివ్..
ఇలా తల్లికి తెలియకుండా 19, 15 ఏళ్ళు ఉన్న ఆమె కూతుళ్ళ పై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇంతలో గుండె ఆగిపోయే విషయం బయటపడింది. ఇటీవలే ఆ టీచర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోగా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. దీంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. ఇద్దరు అమ్మాయిలు తమపై కూడా అత్యాచారం చేశాడని తల్లికి చెప్పారు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే తల్లీ, కూతుళ్లకు కూడా హెచ్ఐవీ టెస్ట్ చేసేందుకు శాంపిళ్లు సేకరించారు.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
Also Read : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని