/rtv/media/media_files/2025/02/20/qBGNf2K93Q29D9xQtsAY.jpg)
ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సాయి ప్రణీత్(26) బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అక్కడ ప్రొస్థెటిక్ ఆర్థోటిక్ క్లినిక్లో పనిచేసే ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతి తండ్రికి గుండెపోటు రావడంతో ఆమె చూడటానికి ఒడిశాకు వెళ్లింది.
అయితే యువతి తండ్రి యోగక్షేమాలు తెలుసుకునేందుకు సాయి ప్రణీత్ సదరు యువతితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతుండేవాడు. దీంతో వారి మధ్య స్నేహం మరింతగా పెరిగి అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ఓ సారి కేరళ టూర్ కు కూడా వెళ్లారు. అక్కడ హోటల్లో ఆమెకు ప్రపోజ్ చేసి నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లంటూ ఆమెను నమ్మించి దగ్గరయ్యాడు సాయి ప్రణీత్. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలకాడు.
గోవాలో మరింత దగ్గర
2023 డిసెంబర్ లో ఇద్దరు కలిసి షిర్డీకి వెళ్లారు. అక్కడికి వచ్చిన సాయి ప్రణీత్ తన తల్లిదండ్రులను, చెల్లెలిని ఆమెకు పరిచయం చేశాడు. అనంతరం నేరుగా గోవాకు వెళ్లి అక్కడ ఆమెకు మరింత దగ్గరయ్యాడు సాయి ప్రణీత్ . 2024లో యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు రాగా.. ఆమె బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి బెంగళూరుకు పిలిపించాడు. ఇద్దరు కలుసుకోవడానికి బాగా దూరం అవుతుందని ఉద్యోగరీత్యా హైదరాబాద్కు షిప్ట్ అయ్యాడు సాయి ప్రణీత్ . ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్లో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు.
అయితే గతేడాది నవంబరులో తన చెల్లికి పెళ్లి కుదిరిందని చెప్పిన సాయి ప్రణీత్.. మంచిర్యాల జిల్లాలోని తన సొంతూరికి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు. అనుమానంతో సదరు యువతి సాయి ప్రణీత్ ను నిలదీయగా రూ.20లక్షలిస్తానని, తనతో బంధం తెంచుకోవాలని కోరాడు. అందుకు నిరాకరించిన యువతి నేరుగా జూబ్లీహిల్స్ పోలీసలుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.