Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

సరదాగా స్కూల్ గేట్‌తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు.

New Update
Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..

స్కూల్ అయిపోయిన తర్వాత సరదాగా ఆడిన ఆట బాలుడి ప్రాణాలను తీసిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాకి చెందిన ఆలకుంట చందు, సరోజ దంపతులు హయత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఏకైక సంతానమైన ఏడేళ్ల అజయ్ అనే కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం హయత్‌నగర్‌లోని ముదిరాజ్ కాలనీలో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!

గేట్ దగ్గర ఆడుతుండగా..

భార్యాభర్తలు జీహెచ్‌ఎంసీలో స్వచ్ఛ ఆటో ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అజయ్‌ హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్న ప్రాథమిక స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. అందరిలానే రోజూ స్కూల్‌కి అజయ్ వెళ్లాడు. సాయంత్రం 3:45 గంటలకు స్కూల్ కూడా పూర్తయ్యింది. అలా ఇంటికి వెళ్లడానికి బయటకు వస్తుండగా.. స్కూల్ గేట్ దగ్గర పిల్లలు ఆడుకోవడం చూశాడు.

ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..

దీంతో ఇంటికి వెళ్లడానికి వ్యాన్ ఎక్కకుండా ఆ గేట్ ఎక్కి  ఊగాడు. ఆ బాలుడు ఎక్కినప్పుడు ఆ గేట్ ఒక్కసారిగా ఊడిపోయి అజయ్ మీద పడింది. దీంతో అజయ్‌కి ఊపిరి ఆడక వెంటనే సొమ్మసిల్లి కింద పడిపోయాడు.అజయ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.

ఇది కూడా చూడండి: USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ

 అప్పటికే అజయ్ మరణించాడు. మరో విద్యార్థికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ స్కూల్ గేట్ బాగా తుప్పు పట్టింది. ముందు కొందరు పిల్లలు ఊగి వెళ్లినప్పుడు కాస్త ఊడిపోగా, అజయ్ ఎక్కినప్పుడు మొత్తం ఊడిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం సరదాగా స్కూల్‌కి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌‌లో ఉండే అంశాలేంటి?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

  • Apr 10, 2025 08:52 IST

    ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!

    జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

    Karimnagar Wife And Husband Incident🔴LIVE : ప్రేమపెళ్లి.. 6 నెలలకే కొట్టి చంపి | Jagtial News | RTV



Advertisment
Advertisment
Advertisment