ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

author-image
By Kusuma
New Update
ICICI Bank : వాటి పై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు!

పల్నాడు జిల్లాలో ఓ బ్యాంక్‌లో భారీ కుంభకోణం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో నరేశ్ మేనేజర్‌గా, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ పనిచేశారు. ఇలా పనిచేస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి రూ.కోట్ల రూపాయిల నగదును ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు లాక్కున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకి చెందిన పొత్తూరి కోటేశ్వరమ్మ ఈ బ్రాంచ్‌లో రూ.45 లక్షలు డిపాజిట్ చేశారు.

ఇది కూడా చూడండి: ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే?

రెన్యూవల్ చేస్తానని చెప్పి..

ఏడాది అయిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేస్తున్నానని ఆమెకు చెప్పి ఆ డబ్బును తన ఖాతాకు బదిలీ చేసుకున్నారు. ఇలా మరికొందరికి చెందిన రూ.79 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అయితే ఖాతాదారులకు అనుమానం రాకుండా ప్రతి నెల వడ్డీ కూడా బ్యాంకు నుంచి వేశారు. రూ.లక్ష రుపాయలకు వెయ్యి చొప్పున అకౌంట్లలో వేశారు. ఈ డబ్బులు ఇటీవల ఆగిపోవడంతో సందేహం వచ్చి బ్యాంకు దగ్గరు వెళ్లి అడగ్గా ఈ విషయం బయట పడింది. ఎందరో ఖాతాదారుల సొమ్మును బదిలీ చేశారని తెలియగా.. వారు బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. అయితే ఈ కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ హరీశ్ కూడా ఉన్నాడని ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Lebanan: నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్‌ పై దాడి!

ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం తాకట్టు చేసిన రుణాల్లో మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా, రీజినల్‌ మేనేజర్‌ రమేశ్‌ ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం 14 మంది ఖాతాదారుల నుంచి రూ.6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం కుంభకోణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. షేక్‌ బాజిబీ అనే మహిళ పేరు మీద ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు, బంగారం రుణాలు ఉండటంతో ఆమె ఖాతాల్లోంచి నగదు భారీగా బదిలీ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Italy: టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు...!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

విశాఖపట్నం జిల్లా కొమ్మాది స్వయం కృషినగర్‌లో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కత్తితో దాడి చేశాడు ఉన్మాది. దాడిలో తల్లి మృతి కూతురికి తీవ్రగాయాలు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో నిందితుడు.

New Update
crime news vishaka

crime news vishaka

AP Crime: ఏపీలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇద్దరిని బలి తీసుకున్న ప్రేమోన్మాది:

 ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

( AP Crime | ap-crime-news | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment