Kerala: హనీమూన్‌కి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం

కేరళలోని పతనంతిట్టలో ఘోర ప్రమాదం జరిగింది. హనీమూన్ నుంచి వస్తున్న జంటను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తజంటతో పాటు ఇరువురి తండ్రులు మృతి చెందారు. ఇంకో 15నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
k accident

ప్రస్తుతం రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకి ఎంత మంది ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారో లెక్క కూడా ఉండటం లేదు. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసిన కూడా ఇతరులు స్పీడ్‌గా లేదా తాగి డైవ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరో ఒకరు చేసిన ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాల్లో వారికి కావాల్సిన మనుషులు మరణించడంతో ఎందరో అనాథులు అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

బస్సు ఢీకొట్టడంతో..

తాజాగా కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరణించిన నలుగురులో ఓ కొత్త జంట ఉంది. హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన వీరు తిరిగి వచ్చారు. 

ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

ఈ క్రమంలో వరుడు, వధువు తండ్రి వారిని పికప్ చేసుకోవడానికి తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు. ఇంటికి వెళ్తుండగా పతనంతిట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి ఇంకో 15 నిమిషాల్లో వెళ్లిపోతారనే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన బస్సులో శబరిమల యాత్రికులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Road accident : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని వస్తుండగా కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం  వద్ద లారీ ఢీకొట్టింది.

New Update
Road accident

Road accident

 Road accident : శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్నారు. అనంతరం కుమారుడితో పాటు మరో ఇద్దరితో కలిసి పాతపట్నానికి కారులో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం  వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనకు అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు సేఫ్టీ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని, నిషేధిత పదార్థాలు తరలించొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!

Advertisment
Advertisment
Advertisment