Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

కర్ణాటలో లారీని నడుపుతుండగా డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపు వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యక్తి మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు.

New Update
Karnataka Road accident

Karnataka Road accident Photograph: (Karnataka Road accident)

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో కంటైనర్ లారీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కంటైనర్ అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కూరగాయల షాపులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడిక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

నెలల పసికందు..

ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో తండ్రితో పాటు 5 నెలల కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తల్లి, తండ్రి, భార్య, 5 నెలల కుమారుడితో హైదరాబాద్‌ నుంచి సొంత పట్టణం అయిన సూర్యాపేటకు బయల్దేరారు. కొంత వరకు వారి ప్రయాణం సాఫీగా సాగిపోయింది. కానీ ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

ఈ ప్రమాదంలో సాయి కుమార్, 5 నెలల కుమారుడు మృతి చెందారు. హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం చెరువు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. అనంతరం సాయి కుమార్ ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pregnant scam : 30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!

యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.

New Update
pregnant scam

pregnant scam

యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది. ఇదంతా జనని సురక్ష యోజన, ఫిమేల్ స్టెరిలైజేషన్ ప్రమోషన్ స్కీమ్‌లో జరిగిన స్కామ్ అని విచారణలో బయపడింది.  

ఫతేహాబాద్‌లోని సిహెచ్‌సిలో ఆరోగ్య శాఖ క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆడిట్ బృందం పత్రాలను పరిశీలించడం కొనసాగించడంతో, వారు మరింతగా షాక్ అయ్యారు. అదే పేరు గల ఒక మహిళకు 25 ప్రసవాలు, ఐదు స్టెరిలైజేషన్లు జరిగినట్లు రికార్డులలో చూపబడింది. ఇది మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల పేరుతో మొత్తం రూ.45,000 ఈ మహిళ ఖాతాకు బదిలీ చేయబడింది.

దోషిగా తేలితే కఠిన చర్యలు

ఈ విషయం ఆడిట్ బృందం దృష్టికి రాగానే, వారు వెంటనే ఆగ్రా సీఎంఓ డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవకు దీని గురించి సమాచారం అందించారు. డాక్టర్ శ్రీవాస్తవ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని, మొత్తం విషయం తెలుసుకుని దర్యాప్తుకు ఆదేశించారు. ఇది సాంకేతిక తప్పిదమా లేక ఉద్యోగుల అండదండతో జరిగిన మోసమా అనే దానిపై దర్యాప్తు చేస్తామని అన్నారు. ఎవరైనా దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయమని తెలిపారు.  

యూపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రధాన పథకాలను నిర్వహిస్తుంది. జననీ సురక్ష యోజన, స్త్రీ స్టెరిలైజేషన్ ప్రోత్సాహక పథకం. ఈ పథకాల కింద, జనని సురక్ష యోజన కింద, ప్రసవం తర్వాత స్త్రీకి రూ.1400, ఆమెను ప్రేరేపించే ఆశా కార్యకర్తకు రూ.600 ఇవ్వబడుతుంది. స్టెరిలైజేషన్ తర్వాత, స్త్రీకి రూ.2000, ఆశాకు రూ.300 లభిస్తాయి. ఈ మొత్తం 48 గంటల్లోపు నేరుగా మహిళ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ రెండు పథకాల ముసుగులో ఈ పెద్ద మోసం జరిగింది. ఒక మహిళను పదే పదే ప్రసవానికి చూపించారు, ఆ తర్వాత పదే పదే స్టెరిలైజేషన్ చేయించుకున్నారు, ప్రతిసారీ ప్రభుత్వ డబ్బు చెల్లించారు. ఈ విధంగా, దాదాపు రూ.45,000 విలువైన ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయబడింది.

Also read :  పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య

Advertisment
Advertisment
Advertisment