నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?

కడప నాారాయణ కాలేజీ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప నారాయణ క్యాంపస్‌లో మదన్ మోహన్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కుమారుడిని చూడటానికి హాస్టల్‌కి వెళ్లారు. ఈ కమంలో మదన్ ఇంటికి వస్తానని మారం చేశాడు. దీంతో తండ్రి వద్దని తర్వాత ఇంటికి తీసుకెళ్తా అని మందలించాడు.

ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

మనస్తాపం చెంది హాస్టల్ గదిలోనే..

మనస్తాపం చెందిన మదన్ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌ సిబ్బంది గమనించి మదన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మదన్ మృతి చెందాడు. సాయంత్రం వరకు కుమారుడితో సంతోషంగా గడిపి ఇంటికెళ్లిన తర్వాత కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ల తల్లిదండ్రులు రెండురోజుల క్రితమే పోలీసులు ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

ఫిబ్రవరి 6న మల్కన్‌గరి జిల్లాలో స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యయ్యారు. స్కూల్‌ నుంచి వాళ్లు ఇంటికి రాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు వారికోసం అన్ని చోట్ల వెతికారు. ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగగా.. విద్యార్థులు చెట్టుకు వేలాడుతూ కనిపించారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rape case: మైనర్ బాలికను రేప్ చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. ఫోన్‌లో ట్రైనీల న్యూడ్ ఫొటోలు!

బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

New Update
rape case bg

Bengaluru Badminton coach sexually assaults minor girl

Rape case: బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై  బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

ట్రైనీల న్యూడ్ ఫొటోలు..

ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం ట్రైనీగా చేరింది. ఆమెను బలవంతంగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో మరో 8మంది ట్రైనీల న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాలికతోపాటు మరికొంతమంది అమ్మాయిలను కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుండటం సంచలనం రేపుతోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అయితే బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ తరచుగా బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బయటపడింది. కోచ్‌ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్‌ పిక్స్‌ను అతనికి పంపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను నిలదియగా అసలు విషయం బయటపెట్టింది. కానీ బాలిక మాత్రం కోచ్‌ సురేష్‌తో తానే అక్రమం సంబంధం పెట్టుకున్నట్లు చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

bengalore | rape-case | minor-girl | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment