హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అనేక మందికి గాయాలు

జార్ఖండ్‌లో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఒకరిపైకి ఒకరు రాళ్లు విసురుకోవడంతో పాటు దుకాణాలకు నిప్పు అంటించారు. కొన్ని షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Jharkhand crime

Jharkhand crime Photograph: (Jharkhand crime)

దేశ వ్యాప్తంగా హోలీ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ దాడికి పాల్పడ్డారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పు అంటించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆపే ప్రయత్నం చేశారు. పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

రంగు వేస్తానని యాసిడ్ వేసి..

ఇదిలా ఉండగా ఇటీవల హ్యాపీ హోలీ అని చెప్పి రంగు వేస్తాడనుకుంటే ఏకంగా యాసిడ్ పోసి వెళ్ళిపోయాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని సైదాబాద్ భూలక్ష్మీ గుడిలో అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే దుండగుడు బైక్ పై పారిపోయాడు. ఈ ఘటనలో గుడి అకౌంటెంట్ నర్సింగ్ రావ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు యశోదా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు  సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్లో ఆరుగురు..!

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Accident

Accident

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

రంగారెడ్డి జిల్లాలో కూడా..

ఇదిలా ఉండగా ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అనే అక్కచెల్లెళ్ల పిల్లలు బంధువుల నివాసంలో వివాహ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో వారు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్గర ఆడుకున్నారు. ఆ సమయంలో వారు ఆటల్లో భాగంగా కారులోకి వెళ్లారు. ఆ సమయంలో కార్ డోర్లు లాక్ అయ్యాయి. దీంతో వారు బయటకు రాలేకపోయాయి.  

దీంతో ఊపిరి ఆడక ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే.. చిన్నారులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు కారులో అపస్మారకంగా కనిపించారు. దీంతో వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు