Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి!

సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి.

author-image
By srinivas
New Update
train

Train Accident: రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు. ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్

శుభకార్యానికి హాజరై..

యూపీలోని సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24)లకు అబ్దుల్లా అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం లఖింపూర్ ఖిరి జిల్లా హర్‌గావ్ దగ్గరలోని క్యోతి అనే గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబంతో హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చి ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం అలవాటున్న వారు.. రైల్వే ట్రాక్ పైకి వచ్చి రీల్స్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని విచారించారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read : మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంతమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఇకనైనా రీల్స్ పిచ్చి ఉన్నవారు బుద్ధి తెచ్చుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.

గతంలోనూ యూటూబర్స్ లోయలోపడి చనిపోయిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చితో కుటుంబాలకు దూరం కావొద్దని, పిల్లలను వీలైనంతవరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలే కాదు పెద్దలు సైతం మారాలని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  1. కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి మరో కీల‌క ప‌ద‌వి

                      2.  నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment