/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
హైదరాబాద్లోని పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాన్బాగ్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్గా చెబుతున్నా.. టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!
పాకిస్థాన్లో బాంబు పేలుడు..
ఇదిలా ఉండగా పాకిస్థాన్లో ఇటీవల బాంబు పేలుడు జరిగింది. పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. పలు జట్ల మధ్య మ్యాచ్లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్లో పెను ప్రమాదం చేటుచేసుకుంది. ఆ దేశంలో ఊహించని భారీ బ్లాస్టింగ్ జరిగింది.
ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!
పాకిస్తాన్ ఆత్మాహుతి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పేషావర్ అనే ప్రాంతంలో ఈ బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడు ప్రమాదంలో 5 మంది స్పాట్ లోనే మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!
గాయపడ్డవారిలో దేశ, విదేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. రంజాన్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఈ పేలుడు జరిగిందని స్థానిక పోలీసు అధికారులు నిర్ధారించారు. ఈ బాంబ్ బ్లాస్ట్తో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. వెంటనే సహాయక చర్యలకు పూనుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో పాకిస్తాన్లో ఉన్న విదేశీ క్రికెట్ జట్లు వణికిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!