Khammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి!

హైదరాబాద్‌కు చెందిన బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

New Update
hyderabad missing case

Hyderabad Police identified Bollu Ramesh Missing case

Khammam: హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు త గుర్తించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు చేధనలో భాగంగా మూడురోజులపాటు శ్రమించి చివరికి ట్రేజ్ చేసినట్లు తెలిపారు. జనవరి 19న తన భర్త బొల్లు రమేష్ (52) కనిపించకుండాపోయాడంటూ విక్రంపురి కాలనీకి చెందిన మహిళ నట్టి జనని మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఓ నిందితుడిని అరెస్టు చేశారు. 

పాన్ మసాలా వ్యాపారం..

ఇక అదుపులోకి తీసుకున్న నిందితుడిని తమదైన శైలిలో విచారణ చేయగా బొల్లు రమేష్ ను హత్యచేసినట్లు ఖాద్రి అంగీకరించాడని చెప్పారు. మృతదేహానికి ఘటనా ప్రదేశంలోనే శవపరీక్షలు పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్ గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్ ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు. కేసుచేధనలో కాల్ డేటా కీలకంగా మారిందని సీఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది చెప్పారు. 

ఇది కూడా చదవండి: Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!

బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రితో విభేదాలు ఉన్నట్లు రమేష్ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీతో ఖాద్రిని అదుపులోకి తీసుకొని విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఖమ్మం పాల్వంచలో హత్య చేసి మృత దేహాన్ని పూడ్చి పెట్టినట్లు ఖాద్రి అంగీకరించాడని వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment