/rtv/media/media_files/2025/03/19/ApRaZ9Xs8wwuW5Y386rl.jpg)
bus fire accident Photograph: (bus fire accident)
ఓ ప్రైవేట్ కంపెనీ బస్సులో మంటలు చెలరేటి పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకున్న బస్సులో ఎమెర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ తెరుచుకోలేదు. దీంతో ఉన్న నలుగురు ఎంప్లాయిస్ సజీవదహనమైయ్యారు. అంతేకాదు..ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లో జరిగింది.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
వ్యోమా గ్రాఫిక్స్కు చెందిన 12 మంది ఉద్యోగులు బుధవారం ఉదయం 7 గంటలకు వార్జే నుంచి హింజేవాడికి కంపెనీ మినీ బస్సులో బయలుదేరారు. బస్సు డస్సాల్ట్ సిస్టమ్స్ సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ బస్సును స్లో చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన నలుగురు ఉద్యోగులు ఆ మినీ బస్సు నుంచి కిందకు దిగారు. వెనుక కూర్చొన్నవారు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ డోర్ తెరుచుకోలేదు.
ℙ𝕌ℕ𝔼 | Tragedy struck in Pune, Maharashtra, after a minibus carrying employees of Vyoma Graphics caught fire in the Hinjawadi area, resulting in the loss of four lives and leaving six others severely injured. According to DCP Pimpri-Chinchwad, Vishal Gaikwad, the police… pic.twitter.com/n4zCgY1xVL
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) March 19, 2025
మంటలు పెరిగి వెనుక ఉన్న క్యాబిన్కు వ్యాపించాయి. దీంతో నలుగురు ఉద్యోగులు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. బస్సులో మరణించిన ఉద్యోగుల మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిని వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. అందిస్తున్నారు.
Also read: Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్