Drugs: డాక్టర్‌ ఇంట్లో డ్రగ్స్‌ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు!

హైదరాబాద్‌ చందానగర్‌ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులుదాడి చేసి రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఐదుగురు పరారీలో ఉన్నారు.

New Update
Drugs Delhi airport

Drugs: హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. ఏకంగా డాక్టర్ ఇంట్లోనే పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు చందానగర్‌ గుల్మొహర్‌లోని డ్రగ్స్‌ పార్టీ జరుగుతుందనే సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున  పోలీసులు వైద్యుడి ఇంటిపై దాడి చేయగా..150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ పట్టుబడింది. దాని విలువ రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి..

అయితే ఈ డ్రగ్స్ రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామన్నారు. మరోవైపు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ః

ఇది కూడా చదవండి: ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

భారీగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌..

ఇదిలా ఉంటే.. నగరంలోని జీవీ సులూజా దవాఖానల్లో భారీగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 30న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు హాస్పిటళ్లలో ఎక్సైజ్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మౌలాలీలోని నేహా భగవత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి నార్కోటిక్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక సులూజా దవాఖానలో పెద్ద మొత్తంలో మత్తు మందును నిల్వచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని దిగుమతి చేసి హాస్పిటల్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్‌ సహాయంతో మత్తుమందులు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మరో వైసీపీ కీలక నేతపై లైంగిక ఆరోపణలు.. వాడుకుని వదిలేశాడంటూ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment