AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మందికి ఎయిడ్స్

కేరళ మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీలో ఒకేసారి 10 మందికి HIV పాజిటివ్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది ఒకే ఇంజెక్షన్ సిరంజీతో డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

author-image
By K Mohan
New Update
AIDS with drugs

AIDS with drugs Photograph: (AIDS with drugs)

పది మందికి ఎయిడ్స్ ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారు. కారణం తెలుసుకున్న వైద్యులు షాక్ అయ్యారు. వారు తీసుకున్న డ్రగ్స్ ప్రాణాంతకమైన వ్యాధి సోకడానికి కారణమైంది. కేరళ మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూది ఇంజెక్షన్ వాడినట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారు అని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఇంజెక్షన్‌ సిరంజీని ఉపయోగించి వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. వైద్య అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

2025 జనవరిలో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో మొదట ఒక HIV రోగిని గుర్తించింది. ఈ కేసు బయటపడిన తర్వాత.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసినపుడు సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ HIV సోకిన వారంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటగా ఈ 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజీని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని.. అందుకే వారందరికీ హెచ్ఐవీ సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ 10 మందిని కేరళ వైద్య శాఖ అధికారులు తమ పర్యవేక్షణలో ఉంచారు.

Also read: Immigration Bill 2025: ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు