KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్!

కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHBలో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడింది.

New Update
annam-sounjaya

annam-sounjaya

కట్టుకున్న భర్తే వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్  పరిధిలోని 3వ ఫేజ్ లో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లికి చెందిన సాబాదు రజనీకాంత్ రెడ్డికి, వరంగల్‌ జిల్లా నర్సంపేట పరిధి ఖానాపురానికి చెందిన అన్నం సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. సౌజన్య  పేద కుటుంబం  కావడంతో మేనమామలే పెళ్లి చేశారు. ఈ దంపతులు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లో ఉంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. 

Also read :  Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

భర్త అనుమానాన్ని తట్టుకోలేక

అయితే భర్త అనుమానాన్ని తట్టుకోలేక ఉద్యోగాన్ని మానేసింది సౌజన్య. భర్త తరుచూ వేధిస్తుండటంతో  పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  సోమవారం దంపతుల మధ్య కూడా మరోసారి గొడవ జరగడంతో రజినీకాంత్‌ తన భార్య సౌజన్యను కొట్టాడు. దీంతో ఆమె తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది. మరునాడు తనతో ఇంటికి రావాలని రావాలని రజినీకాంత్‌ కోరగా బాబుకి అన్నం తినిపించి వస్తానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది. 

Also Read :  Uttar Pradesh : భార్యకు పెళ్లి చేసిన భర్త..  సినిమా లెవల్ ట్విస్ట్ ఇచ్చిన బబ్లూ!

భర్త, అత్త, మరిది శారీరకంగా

ఆమె మేనమామలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా ఉదయం ఉరివేసుకుంది. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read :  Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!

Renu Desai: ‘నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'.. HCU వివాదంపై పవన్ మాజీ భార్య సంచలన వీడియో
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mumbai Airport: బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి బూట్లలో ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

New Update
gold rates 123

Gold

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Mumbai Airport Customs Officers Seized 6.7 Kg Gold

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

telugu crime news | Latest crime news | mumbai-airport | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment